Minister Uttam Kumar Reddy : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు వచ్చేలా ఆరున్నర లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తెస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఈసారి బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అదనంగా పదివేల కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖకు ప్రతిపాదలు పంపినట్లు ఆయన చెప్పారు.