Lady Aghori Halchal in Warangal : వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని శ్రీ కొమ్మాల లక్షీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకునేందు సోషల్ మీడియా వైరల్ మహిళా అఘోరీ ఆలయానికి వచ్చింది. దీంతో ఆమెను చూడడానికి స్థానికులు అక్కడికి గుంపులుగా చేరుకున్నారు. ఓ సందర్భంలో వారందరినీ చూసి అఘోరి వారిపై అసహనం వ్యక్తం చేశారు. అందులో ఓ వృద్ధుడు ఆమెతో కాసేపు వాధించారు. అఘోరీ అంటూ అందరినీ మోసం చేస్తున్నావంటూ స్థానికులు అరిచారు.