Chandrababu on P4 Program : జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఇవాళ్టి రోజుల్లో సెల్ఫోన్ అందరికీ అత్యవసర వస్తువుగా మారిందన్నారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మొట్టమొదట దీపం పథకం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.