Ganesha Immersion in Hussain Sagar : వినాయక నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్కు గణనాథుని విగ్రహాలు భారీ సంఖ్యలో తరలివచ్చాయి. దీంతో ఆ ప్రాంతమంతా వెలుగు జిలుగులలో శనివారం రాత్రి సమయంలో శోభాయమానంగా మారింది. సచివాలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. హుస్సేన్సాగర్ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. క్రేన్ల ద్వారా వినాయక విగ్రహాలు గంగమ్మ ఓడికి చేరుతున్న తీరును ఆసక్తిగా తిలకించారు. సచివాలయం నుంచి మొదలుకొని ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్రోడ్ వరకు సందడి వాతావరణం నెలకొంది. నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రోలో రద్దీ తీవ్రంగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 2.61 లక్షల గణేశ్ ప్రతిమల నిమజ్జనం పూర్తయ్యింది. సచివాలయం, అమరవీరుల స్తూపం, రాజీవ్ గాంధీ విగ్రహం, ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్, బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నెక్లెస్ రోడ్ వంటి ప్రాంతాలను చూస్తూ ప్రజలు ఆహ్లాదంగా గడిపారు.
రాత్రంతా వినాయక నిమజ్జనాలు - విద్యుత్ కాంతుల మధ్య వెలిగిపోయిన హుస్సేన్సాగర్
హుస్సేన్సాగర్ వద్ద సీఎం రేవంత్రెడ్డి 'గణపతి బప్పా మోరియా'